ఓటమిని చవిచూసిన భారత్…
1 min read
AAB NEWS : సిడ్నీ: ఆతిథ్య ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత్కు ఆరంభంలోనే ఝలక్ తగిలింది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే ఆదివారం సిడ్నీ మైదానంలో జరుగుతుంది. ఆసీస్ నిర్దేశించిన 375 పరుగుల భారీ ఛేదనలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో వికెట్లకు పరుగులు చేసింది.
ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య(90: 76 బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లు), ఓపెనర్ శిఖర్ ధావన్(74: 86 బంతుల్లో 10ఫోర్లు) పోరాడినా భారత్కు ఓటమి తప్పలేదు. ఫామ్లేమితో సతమతమవుతున్న కెప్టెన్ కోహ్లీ(21) నిరాశపరిచాడు. ఐపీఎల్లో ఓపెనర్గా దుమ్మురేపిన కేఎల్ రాహుల్(12), శ్రేయస్ అయ్యర్(2) మిడిలార్డర్లో విఫలమయ్యారు. ఆతిథ్య బౌలర్లు జోష్ హేజిల్వుడ్(3/55) భారత్ను ఆదిలోనే భారీ దెబ్బకొట్టాడు. మధ్య ఓవర్లలో స్పిన్నర్ ఆడమ్ జంపా(4/54) వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఒత్తిడిలో పడేశాడు.
అంతకుముందు ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్లకు 374 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ అరోన్ ఫించ్(114:124 బంతుల్లో 9ఫోర్లు, 2సిక్సర్లు), స్టీవ్ స్మిత్(105: 66 బంతుల్లో 11ఫోర్లు, 4సిక్సర్లు) అద్భుత శతకాలతో ఆకట్టుకోగా డేవిడ్ వార్నర్(69: 76 బంతుల్లో 6ఫోర్లు) అర్ధశతకంతో రాణించడంతో ఆసీస్ రికార్డు స్కోరు సాధించింది. ఆఖర్లో మాక్స్వెల్(45: 19 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగడంతో స్కోరు వేగం జెట్స్పీడ్తో దూసుకెళ్లింది. భారత బౌలర్లు దారళంగా పరుగులు సమర్పించుకున్నారు. మహ్మద్ షమీ ఒక్కడే మూడు వికెట్లు తీసి ఫర్వాలేదనిపించాడు. బుమ్రా, సైనీ, చాహల్ తలో వికెట్ తీసినా కంగారూలను కట్టడి చేయలేకపోయారు.
48 Total Views, 2 Views Today