ప్రియుడితో కల్సి భర్తను హత్య చేసిన భార్య
1 min read
AABNEWS తెలంగాణ క్రైమ్ బ్యూరో డా.సామల శశిధర్ రెడ్డి
ప్రియుడి పై వున్న మోజుతో తాళికట్టిన భర్తను భార్య హత్య చేయించిన సంఘటనలో సుబేదారి పోలీసులు మొత్తం నలుగురు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు.
పోలీసులు నిందితుల నుండి ఒక కారు నాలుగు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1. హన్మకొండ డానీ, పెద్దమ్మగడ్డ, హన్మకొండ, వరంగల్, 2. తాళ్ళపల్లి పూజిత(మృతుడి భార్య), వడ్డెపల్లి, హన్మకొండ.3. హన్మకొండ నతీష్, పెద్దమ్మగడ్డ, హన్మకొండ, వరంగల్, 4.కొట్టి సుధామణి, జులైవాడ, హన్మకొండ, వరంగల్ జిల్లాకు చెందిన వారు వున్నారు.
ఈ అరెస్టుకు సంబంధించిన వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్ వివరాలను వెల్లడిస్తూ గత జనవరి నెల 24 తేదిన వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన తాళ్ళపల్లి అనిల్ అనే వ్యక్తి కనబడటం లేదని అతని భార్య తాళ్ళపల్లిపూజిత ఇచ్చిన ఫిర్యాదుపై మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న సుబేదారి పోలీసులు. సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి పుష్పా సూచనల మేరకు సుబేదారి ఇన్స్పెక్టర్ అధ్వర్యంలో దర్యాప్తు చేపట్టడం జరిగింది. పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్న సమయంలో కనబడకుండా పోయిన వ్యక్తి తాళ్ళపల్లి అనిల్ గత జనవరి 29వ తేదీన రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్ లో శవమైన కనిపించడంతో పాటు, మృతుడు తాళ్ళపల్లి అనిల్ మరణం మృతుడి భార్య పూజితని బంధువులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు
ఈ కేసుపై ప్రత్యేక దృష్టిసారించి విచారణ చేపట్టడం జరిగింది. పోలీసుల దర్యాప్తులో మృతుడి మరణానికి కారణం భార్య పూజితతో పాటు, హన్మకొండ డానీ, హన్మకొండ సతీష్,కొట్టి సుధామణిలు నిందితులని పోలీసులు నిర్వహించిన విచారణలో తెలడంతో సుబేదారి పోలీసులు నిందితులను ఈ రోజు అరెస్టు చేసి విచారించగా మృతుడు అనిలను హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తెలడంతో పాటు హత్య జరిగిన తీరును నిందితలు వెల్లడిస్తూ 2018 సంవత్సరంలో మృతుడికి వరుసకు తమ్మడైన హన్మకొండ డ్యాని వద్ద మృతుడు అనీల్ తన ట్రాలీ ఆటోను తనాఖా పెట్టి లక్ష రూపాయలను అప్పుగా తీసుకోవడంతో నిందితుడు డ్యాని ప్రతి రోజు మృతుడు ఇంటికి వెళ్ళి అప్పు వాయిదా పద్ధతిలో డబ్బును తీసుకోనేవాడు. ఇదే క్రమములో నిందితుడికి ప్రధాన నిందితురాలు మృతుడు భార్యపూజితకు మధ్య పరిచయం కావడంతో వీరి మధ్య పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీయడంతో పాటు, నిందితులు శారీరకంగా కలుసుకోనేందుకుగాను నిందితుడు డ్యాని అక్కయిన మరో నిందితురాలు సుధామణి తన ఇంటిలోనే అవకాశం కల్పిస్తూ వీరికి సహకరించేది.
ఈ క్రమములో మనఇద్దరి విషయం నాభర్తకు తెలిసినట్లు వుంది. అందుకే రోజు కారణం లేకుండా గోడవపడుతున్నాడని, ఇకపై అతనితో కాపురం చేయలేనని, నా భర్తను చంపి అడ్డు తొలగించుకుంటే మనమిద్దరం కల్సి జీవించవచ్చని నిందితురాలు పూజిత డ్యానికి సూచించింది. గత జనవరి 22వ తేదీన తన భర్త అనిల్ హైదరాబాదు వెళ్ళినట్లుగా డ్యానీకి తెలిపగా, డ్యానీ సూచన మేరకు వంద ఫీట్ల రోడ్డు మార్గం వద్ద కారులో వచ్చిన డ్యానీని కలుసుకున్నా పూజిత తన భర్తను చంపాల్సిందిగా సూచించడంతో మృతుడు అనిలను చంపేందుకు నిందితుడు డ్యానీ నిర్ణయించుకున్నాడు. మృతుడు అనిల్ ను చంపేందుకుగాను తనకు వరుసకు తమ్మడైన హన్మకోండ సతీష్ సహకారం తీసుకున్నాడు. మృతుడు అనిల్ హన్మకొండకు తిరిగి వస్తున్నట్లుగా డ్యానీకి పూజిత సమాచారం ఇవ్వడంతో డ్యానీ మరో నిందితుడు సతీష్ తో కల్సి కాజీపేట్ ఫాతీమా జంక్షన్ వద్ద కారులో చేరుకోని వేచివుంది. మృతుడు బస్సులో ఎక్కడవున్నాడు అనే సమాచారాన్ని పూజిత ద్వారా సెల్ ఫోన్ ద్వారా తెలుసుకుంటున్న డ్యానీ ఫాతీమా జంక్షన్ వద్ద బస్సు దిగి ఆటోలో ఇంటికి బయలుదేరిన మృతుడిని నిందితులు డ్యానీ, సతీష్ కారులో వెంబడించగా, వడ్డెపల్లి చర్చ్ వద్ద దిగిన మృతుడు అనిల్ ను నిందతుడలు పనివుందని కారులో ఎక్కించుకోని పెగడపల్లి డబ్బాలు,వంగపహాడ్ మీదుగా, అవుటర్ రింగ్ రోడ్డు మీదకు చేరుకోని అక్కడే కారులోనే మృతుడుతో కల్సిన మద్యం సేవించి రాత్రి 10.30 గంటల సమయంలో నిందితులు ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం మృతుడు అనిలను కారులో ఎక్కించుకోని భీమారం మీదుగా హసన్పర్తి మండలం అనంతసాగర్ కెనాల్ వద్ద చేరుకోని నిందితులిద్దరు కల్సి మృతుడు అనిల్ ను తీవ్రంగా కొట్టడంతో పాటు మృతుడు అనిల్ ఒంటిపై వున్న చోక్కను విప్పి చోక్కతో అనిల్ గోంతుని బిగించి హత్య చేశారు. నిందితులిద్దరు. హత్య అనంతరం నిందితులు అనిల్ మృతదేహాన్ని కెనాల్ లో పడవేశారు అనిల్ తామే హత్య చేసినట్లుగా ఎవరికీ అనుమానం రాకుండా వుందేంకుగాను తన భర్త కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందిగా నిందితులు ముగ్గురు మృతుడి భార్యకు సూచించడంతో ప్రధాన నిందితురాలు పూజిత తన కనిపించడం లేదని ఫిర్యాదు చేయడం జరిగిందని. నిందితులు ఇచ్చిన వాంగ్మూలం అనుసరించి మిస్సింగ్ కేసులు హత్య కేసుగా నమోదు చేయడం జరిగిందని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.
హత్య కేసును ఛేదించి నిందితులను గుర్తించి అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.
310 Total Views, 2 Views Today