హాట్ హాట్ న్యూస్…
1 min read
AAB NEWS: అమరావతి : తీవ్రవాయుగుండంగా కొనసాగుతున్న నివర్ తుపాను.. రాగల 6 గంటల్లో వాయుగుండంగా, ఆ తదుపరి అల్పపీడనంగా బలహీన పడనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. తిరుపతికి పశ్చిమ నైరుతిగా 30 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి పశ్చిమ వాయువ్య దిశగా 115 కిలోమీటర్ల దూరంలో నివర్ తుపాన్ కొనసాగుతోందని తెలిపారు. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల వ్యాప్తంగా గంటకు 55-75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. శుక్రవారం రాత్రి సమయానికి నివర్ ప్రభావం తగ్గనుందని పేర్కొన్నారు.
రాగల రెండు రోజులు : కాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో శుక్రవారం పలుచోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయి. శనివారం నాడు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విస్తృతంగా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల నేపధ్యంలో వాగులు, వంకలు పొంగిపోర్లే అవకాశం ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు పంట సంరక్షణకై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కన్నబాబు తెలిపారు.
22 Total Views, 2 Views Today