గ్రేటర్ సర్వం సిద్ధం…
1 min read
AAB NEWS :
హైదరాబాద్: జీహెచ్ ఎంసీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 150 వార్డుల్లో 74.44 లక్షల ఓటర్లు ఉండగా..1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఎస్ఈసీ వెబ్సైట్లో ఓటరు స్లిపులు డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు పోలింగ్ కేంద్రం లొకేషన్ను సైతం తెలుసుకోవచ్చు. మొబైల్యాప్లో, మైజీహెచ్ఎంసీ యాప్లో పోలింగ్ స్టేషన్ లొకేషన్ను తెలుసుకునే వెసులుబాటు ఉంది. 2,272 కేంద్రాలను లైవ్ వెబ్ క్యాస్టింగ్తో పర్యవేక్షిస్తారు.
గ్రేటర్లోని సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు పటిష్ఠబందోబస్తు ఏర్పాటు చేశారు. పాత బస్తీ పరిధిలోనే ఎక్కువగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల్లో శాంతి భద్రతల నిర్వహణ కోసం 52,500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
మొత్తం ఓటర్లు: 74,44,260
పురుషులు: 38,77,688
స్త్రీలు: 35,65,896
ఇతరులు: 676
మైలార్దేవ్పల్లిలో అత్యధిక ఓటర్లు: 79,579
రాంచంద్రాపురంలో అత్యల్ప ఓటర్లు: 27,948
పోటీలో ఉన్న అభ్యర్థులు: 1,122
జంగమ్మెట్లో అత్యధికంగా పోటీలో: 20 మంది
మొత్తం పోలింగ్ కేంద్రాలు: 9,101
సున్నితమైనవి: 2,336
అతి సున్నితమైనవి: 1,207
క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు: 279
48 Total Views, 2 Views Today