రజినీకాంత్ ఆరోగ్యంపై గవర్నర్ తమిళిసై ఆరా …
1 min read
AABNEWS : హైదరాబాద్: సూపర్స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. అపోలో వైద్యులకు ఫోన్ చేసి గవర్నర్ సమాచారం తెలుసుకున్నారు. శుక్రవారం ఉదయం రజినీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో రజినీకాంత్కు చికిత్స కొనసాగుతోంది. రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎవరూ ఆందోళన చెందొద్దని అపోలో వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని తెలిపారు. ఈరోజు రాత్రికి వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని చెప్పారు. రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తారని వైద్యులు వెల్లడించారు. హైబీపీ పెరగడంతో చిత్ర యూనిట్ ఆస్పత్రికి షిఫ్ట్ చేసిందని వైద్యులు తెలిపారు. ఇంటర్నేషనల్ సూట్లోని ప్రత్యేక రూంలో రజినీకి వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక డాక్టర్ పర్యవేక్షణలో రజినీ సెల్ఫ్ ఐసొలేషన్లో ఉన్నారన్నారు. కూతురు ఐశ్వర్యను సైతం రూం దగ్గరకు రజినీ రావొద్దని చెప్పినట్లు అపోలో వైద్యులు తెలిపారు. ఇప్పటికే చెన్నై నుంచి హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి రజినీ వ్యక్తిగత వైద్యులు చేరుకున్నారు.
82 Total Views, 2 Views Today