ట్రాక్టర్, బస్సు ఢీ…
1 min read
AABNEWS : కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని శాంతిరాం వైద్యశాల వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. మార్నింగ్ స్టార్ ట్రావెల్ బస్సు ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ట్రాక్టర్ బోల్తా పడగా, బస్సు రహదారి పక్కకు దూసుకెళ్లింది. ట్రాక్టర్, బస్సు డ్రైవర్లతో పాటు మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు సమీపంలోని శాంతిరాం వైద్యశాలలో చికిత్స అందించారు. ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
119 Total Views, 2 Views Today